ప్రభుత్వ ఆస్పత్రుల ను వినియోగించుకోండి: ఓవైసీ

ABN , First Publish Date - 2020-07-14T10:19:33+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడిన పేద వర్గాలు వైద్య చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దని

ప్రభుత్వ ఆస్పత్రుల ను వినియోగించుకోండి: ఓవైసీ

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ బారిన పడిన పేద వర్గాలు వైద్య చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవద్దని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలని మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. మెరుగైన వైద్యచికిత్స కోసం గ్రేటర్‌ పరిధిలోని పార్టీ కార్పొరేటర్‌లు, శాసనసభ్యుల సాయం పొందాలని సూచించారు. రోజురోజుకూ గ్రేటర్‌, శివారు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ విస్తరిస్తోందని అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా బారిన పడిన రోగులు ఆందోళన చెందాల్పిన అవసరం లేదన్నారు. 

Updated Date - 2020-07-14T10:19:33+05:30 IST