కైలాస వాహనంపై ఊరేగుతున్న ఆది దంపతులు

ABN , First Publish Date - 2021-01-16T05:57:54+05:30 IST

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఐదోరోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాసవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

కైలాస వాహనంపై ఊరేగుతున్న ఆది దంపతులు
ఆది దంపతులకు కైలాస వాహన సేవ

శ్రీశైలం, జనవరి 15: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఐదోరోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాసవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ పాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాసవాహనంపై ఆశీనులను చేసి పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఉత్సవం ఎదుట కళాకారుల డప్పు వాయిద్యాలు, శంఖు, డమరుక నాదాలు, చెంచుల నృత్యాల సందడి భక్తులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు రోజు సంక్రాంతి నాడు ఆది దంపతులు నందివానంపై దర్శనం ఇచ్చారు. ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. నస్వామి అమ్మవార్లకు లీలా కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ కల్యాణానికి కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి చెంచులను ఆహ్వానించారు. 




Updated Date - 2021-01-16T05:57:54+05:30 IST