దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చే వరకు పోరాటం: ఉత్తమ్

ABN , First Publish Date - 2022-03-20T16:57:53+05:30 IST

దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే వరకూ పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చే వరకు పోరాటం: ఉత్తమ్

మెదక్ జిల్లా: గిరిజన, అణగారిన వర్గాల భూముల విషయంలో వారి హక్కులను కాపాడేందుకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్ జిల్లా తూప్రాన్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చే వరకూ పోరాటం చేస్తామన్నారు. వేల కోట్ల రూపాయల ఉపాధి నిధుల పనులు టీఆర్ఎస్ వారికే ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, స్థానిక నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-20T16:57:53+05:30 IST