కేసీఆర్ స్టేట్మెంట్లో సెన్స్ లేదు: ఉత్తమ్
ABN , First Publish Date - 2022-07-17T23:07:17+05:30 IST
ఇతర దేశాల క్లౌడ్ బరెస్ట్ కుట్రతో వరదలు వచ్చాయని కేసీఆర్ సిల్లి కామెంట్స్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ఇతర దేశాల క్లౌడ్ బరెస్ట్ కుట్రతో వరదలు వచ్చాయని కేసీఆర్ సిల్లి కామెంట్స్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వరదలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోయిందన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. క్లౌడ్ బరెస్ట్ సాధ్యమయ్యేది కాదన్నారు. కేసీఆర్ స్టేట్మెంట్లో సెన్స్ లేదని ఆయన విమర్శించారు.