ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2022-05-22T01:48:27+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు

ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ: ఉత్తమ్‌

చింతలపాలెం: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ  చేస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులతో పాటు కౌలురైతులకు ఏడాదికి రూ.15 వేల పంటసాయాన్ని అందజేస్తామన్నారు. భూమి లేని వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున బ్యాంక్‌లో జమచేస్తామని తెలిపారు. వరికి రూ.2500, మిర్చికి రూ.15 వేల మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ నుంచి ఎమ్మెల్యే సైదిరెడ్డి వరకు ఇసుక, భూమి, వైన్స్‌ వంటి వాటి నుంచి దొరికినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడి త్వరలో వారికి బుద్ధి చెబుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2022-05-22T01:48:27+05:30 IST