ఉత్తరప్రదేశ్: ఘజియాబాద్‌లో దారుణం..

ABN , First Publish Date - 2021-09-03T20:08:23+05:30 IST

ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు.

ఉత్తరప్రదేశ్: ఘజియాబాద్‌లో దారుణం..

ఉత్తరప్రదేశ్: ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. కిరాణా దుకాణానికి ముందు ఎండ, వానల నుంచి రక్షణకు రేకుల షెడ్లు నిర్మించారు. బుధవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ మీటర్‌కు అనుసంధానించిన వైరు కొసలు తేలి రేకులకు, వాటి ఆనుకుని ఉన్న ఇనుప స్తంభానికి కరెంట్ ప్రవహించింది. ఇది తెలియక దుకాణంలో కొనుగోలుకు వెళ్లిన చిన్నారులు ఇనుప స్తంభాన్ని తాకడంతో కరెంట్ షాక్ కొట్టింది. వారిని రక్షించబోయిన ఓ మహిళ, మరో వ్యక్తికి కూడా షాక్ తగిలింది. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.

Updated Date - 2021-09-03T20:08:23+05:30 IST