Yogi Key Decision: కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన యోగి సర్కారు... ఇక వారికి చుక్కలే!
ABN , First Publish Date - 2022-09-24T03:29:25+05:30 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (ఉత్తరప్రదేశ్ సవరణ) బిల్లు 2022ను యూపీ అసెంబ్లీ ఆమోదించింది. అత్యాచారాలకు పాల్పడే వారికి ఇకపై యాంటిసిపేటరీ బెయిల్ దొరకదు. పోకిరీలను పోక్సో యాక్ట్ కింద బుక్ చేస్తారు. మహిళలు, బాలికలపై దురాచారాలు తగ్గుతాయని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. యూపీ మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా ఈ బిల్లును అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం బిల్లు శుక్రవారం ఆమోదం పొందింది.
25కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహిళలపై అత్యాచారాలు సాధారణమైపోయాయి. దీంతో చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (ఉత్తరప్రదేశ్ సవరణ) బిల్లు 2022ను యూపీ అసెంబ్లీ ఆమోదించడం మహిళలపై కొంత మేరకు అఘాయిత్యాలు తగ్గవచ్చని భావిస్తున్నారు.