గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసుపై ఏటీఎస్ ముంబైలో విచారణ
ABN , First Publish Date - 2022-04-05T18:14:32+05:30 IST
గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది....
ముంబై: గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నిందితుడు ముర్తజా తన కుటుంబంతో కలిసి నివసించిన నవీ ముంబైని ఏటీఎస్ బృందం సందర్శించింది. గత మూడేళ్లుగా ముర్తజా తన కుటుంబ సభ్యులను కలవలేదని సమాచారం.గోరఖ్నాథ్ ఆలయ ప్రధాన ద్వారం వద్ద పోలీసు సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడి చేసిన నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీ అకస్మాత్తుగా ఇంటి నుంచి తప్పిపోలేదని సమాచారం. భద్రతా సంస్థలు కూడా అతని అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టాయి.ముర్తజా ఇంటి నుంచి తప్పించుకుని ముర్తజా నేపాల్ వెళ్లినట్లు చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో ఆలయం వెలుపల దొరికిన బ్యాగ్ నుంచి మతపరమైన పుస్తకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.