విద్యుదాఘాతంతో ఉత్తరప్రదేశ్ వాసి మృతి
ABN , First Publish Date - 2021-12-03T05:45:28+05:30 IST
మండలంలోని పాలకొలను గ్రామ సమీపాన జరుగుతున్న డీఆర్డీవో (ఆయుధాల పరిశ్రమ)లో పని చేస్తున్న శ్రీకాంత్ వర్మ(23) విద్యుదాఘాతానికి గురై గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.
ఓర్వకల్లు, డిసెంబరు 2: మండలంలోని పాలకొలను గ్రామ సమీపాన జరుగుతున్న డీఆర్డీవో (ఆయుధాల పరిశ్రమ)లో పని చేస్తున్న శ్రీకాంత్ వర్మ(23) విద్యుదాఘాతానికి గురై గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. ఆయుధాల పరిశ్రమలో ఉత్తరప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ వర్మ పని నిమిత్తం పరిశ్రమల్లో వెళ్తుండగా.. నీటిలో కరెంటు తీగ ఎర్త్ కావడంతో అది గమనించని శ్రీకాంత్ వర్మ నీటిలో దిగడంతో కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.