ఎన్నారైలతో సంబంధాలు బలపరుచుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-09T03:19:37+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్ మూలాలున్న ఎన్నారైలతో సాంస్కృతిక, ఆర్థిక బంధాలను బలపరుచుకునేందుకు యూపీ ప్రభుత్వం ఓ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

ఎన్నారైలతో సంబంధాలు బలపరుచుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రణాళిక

ఎన్నారై డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ మూలాలున్న ఎన్నారైలతో సాంస్కృతిక, ఆర్థిక బంధాలను బలపరుచుకునేందుకు యూపీ ప్రభుత్వం ఓ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరో రెండేళ్లల్లో ఈ ప్లాన్ అమలు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు ఎన్నారై శాఖ అధికారులు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. యూపీ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి పూర్తి వివరాలను ఎన్నారై రికార్డుల్లో పొందుపరిచేందుకు యోచిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. యూపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఎన్నారైలను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో 1203 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు  ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిపారు. మరోవైపు.. యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ఓ వెబ్‌పోర్టల్‌ను సిద్ధం చేసింది. 50 మంది ఎన్నారైలను ఉత్తరప్రదేశ్ రత్న అవార్డులతో సత్కరించింది.  



Read more