ఉత్తరాఖండ్ సీఎంపై అభ్యర్థిని ప్రకటించిన 'ఆప్'

ABN , First Publish Date - 2021-09-15T21:20:01+05:30 IST

త్తరాఖండ్ ఎన్నికలను ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల..

ఉత్తరాఖండ్ సీఎంపై అభ్యర్థిని ప్రకటించిన 'ఆప్'

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికలను ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామీపై ఆప్ అభ్యర్థిగా ఎస్ఎస్ కలెర్ పోటీ చేయనున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఖతిమా నియోజకవర్గం నుంచి థామీపై కలెర్‌ను పోటీలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆప్ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి కలెర్ రాజీనామ చేశారు. కలెర్ రాజీనామాతో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించినట్టు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి, సీనియర్ నేత కల్నల్ అజయ్ కొథియాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల పేర్లను త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.



Updated Date - 2021-09-15T21:20:01+05:30 IST