ఇదే ఘటన మహారాష్ట్రలో జరిగి ఉంటే ప్రభుత్వం కూలిపోయేది: వీహెచ్
ABN , First Publish Date - 2021-12-06T21:47:52+05:30 IST
పంజాగుట్ట సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రాహం ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోందని...
హైదరాబాద్: పంజాగుట్ట సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రాహం ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడంపై వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘటన మహారాష్ట్రలో జరిగి ఉంటే ప్రభుత్వం కూలిపోయేదన్నారు. దళిత బంధుకు రూ. 10 లక్షలు ఇస్తున్నారని కానీ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావడంలేదని మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై వైఎస్ షర్మిల, అసదుద్దీన్ ఒవైసీ స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.