కలెక్టర్గా వి.విజయరామరాజు
ABN , First Publish Date - 2021-07-24T06:00:50+05:30 IST
జిల్లా కలెక్టర్గా వి.విజయరామరాజును నియమిస్తూ చీఫ్సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ హరికిరణ్ను తూర్పుగోదావరి కలెక్టర్గా నియమించారు.
కడపకు రావడం ఆనందంగా ఉంది
ఈస్ట్ గోదావరి కలెక్టర్గా హరికిరణ్ బదిలీ
కడప, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్గా వి.విజయరామరాజును నియమిస్తూ చీఫ్సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ హరికిరణ్ను తూర్పుగోదావరి కలెక్టర్గా నియమించారు. 2012 బ్యాచకు చెందిన విజయరామరాజు బిడ్స్ప్లానింగ్లో గ్రాడ్యుయేట్ చేశారు. రైల్వేలో పనిచేశారు. 2014 నుంచి 15 వరకు రాజమండ్రి సబ్ కలెక్టర్గా, 2016 నుంచి 18 వరకు అక్కడే మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. 2018-19 నుంచి తిరుపతి మున్సిపల్ కమిషనర్గా, తుడా వైస్ చైర్మనగా పనిచేశారు. అక్కడి నుంచి బదిలీపై మార్క్ఫెడ్ ఎండీగా విజయవాడలో పనిచేశారు. 2019 ఆగస్టు నుంచి ఏపీ మెడికల్ సర్వీస్ ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు వైస్ చైర్మన, మైనింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కడప కలెక్టర్గా వస్తున్న విజయరామరాజును ఆంధ్రజ్యోతి ఫోనలో పలుకరించగా కడపకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాను అభివృద్ధి బాటలో పయనింపజేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన ప్రతిఒక్కరికీ చేరేలా కృషి చేస్తానన్నారు. వారం రోజుల్లో కలెక్టర్గా బాధ్యతలు చేపడతానన్నారు.
ప్రస్తుతం పనిచేస్తున్న హరికిరణ్ 2018 మే 10న కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యత పనులను పూర్తి చేయడంలో కీలకపాత్ర పోషించారు. జగన సర్కార్ చేపట్టిన నవరత్నాలు, సచివాలయ వ్యవస్థ, జగనన్న ఇంటి స్థలాల కేటాయింపుల్లో చురుగ్గా పనిచేశారు.