రాష్ట్రంలో ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2021-12-08T05:46:06+05:30 IST

రాష్ట్రంలో ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి

రాష్ట్రంలో ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి
కందుకూరులో మాట్లాడుతున్న కందడి శ్రీరాం

కందుకూరు: రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న లక్షా 91వేల 126 పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు కందడి శ్రీరాం డిమాండ్‌ చేశారు.  ఏబీవీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసే లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమాలు చేసి, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల పట్ల కనికరం లేకుండా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్యం టెండ్లపై ఉన్న ధ్యాస ఉద్యోగాల భర్తీపై చూపాలన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అనీల్‌, శివ, సంజీవ, బీజేపీ నాయకులు సాధ మల్లారెడ్డి, నిమ్మ అంజిరెడ్డి, ఊటు మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:46:06+05:30 IST