ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-06-21T03:17:18+05:30 IST
దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని బీజేవైఎం జిల్లా ఇన్చార్జి కొక్కిరి శ్రీనివాసులు పేర్కొన్నారు.
కావలిటౌన్, జూన్ 20: దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని బీజేవైఎం జిల్లా ఇన్చార్జి కొక్కిరి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో జరిగిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో కేంద్రాలను బీజేవైఎం నేతలు సందర్శించి వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే.బ్రహ్మానందం, బీజేవైఎం నేతలు ఆళ్ల తిరుపతిరావు, మంద కిరణ్, అక్కిలగుంట జీవ, సవీంద్ర, షేక్ ఖాదర్బాషా, వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.