10 వేల మందికి వ్యాక్సినేషన్ లక్ష్యం
ABN , First Publish Date - 2021-07-27T04:09:23+05:30 IST
ప్రభుత్వg చేపట్టిన కొవిడ్ మెగా వ్యాక్సినేషన్లో ఆత్మకూరు డివిజన్లో సోమవారం ఒక్కరోజే పది వేల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు
సంగం, జూలై 26: ప్రభుత్వg చేపట్టిన కొవిడ్ మెగా వ్యాక్సినేషన్లో ఆత్మకూరు డివిజన్లో సోమవారం ఒక్కరోజే పది వేల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డివిజన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సత్రం సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా సెంటర్ను తనిఖీ చేసి టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. డివిజన్లోని పది మండలాల్లో పదివేల వ్యాక్సినేషన్ లక్ష్యం కాగా సంగం మండలంలో 800 టీకాలు వేయాలని నిర్దేశించామని తెలిపారు. ఆయన వెంట వైద్యాధికారి ప్రతిమ, మంజుల ఉన్నారు.