26, 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీకా

ABN , First Publish Date - 2021-04-23T10:57:04+05:30 IST

ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్‌ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి

26, 27న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీకా

ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు కొవిడ్‌ టీకా వేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో వీరితో పాటు శాసనమండలి సచివాలయ సిబ్బందికి రెండో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ, శాసనమండలి కార్యక్రమాలకు హాజరయ్యే పత్రికా విలేకరులు ఈ నెల 27న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ టీకా వేయించుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-04-23T10:57:04+05:30 IST