నేడు, రేపు వ్యాక్సినేషన్ బంద్
ABN , First Publish Date - 2021-07-27T06:48:35+05:30 IST
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు అధికారులు రెండు రోజులు సెలవు ప్రకటించారు. వ్యాక్సిన్ కొరత కారణంగా మంగళవారం, ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వ్యాక్సిన్కు సెలవు ఇచ్చారు.
నల్లగొండ అర్బన్, జూలై 26: కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు అధికారులు రెండు రోజులు సెలవు ప్రకటించారు. వ్యాక్సిన్ కొరత కారణంగా మంగళవారం, ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వ్యాక్సిన్కు సెలవు ఇచ్చారు. జిల్లాకు నిత్యం 5వేల లోపు డోస్లు సరఫరా అవుతుండగా, వ్యాక్సిన్ కోసం వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,40,626 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అందులో 2,75,035మంది మొదటి డోస్ తీసుకోగా, 65,591మంది రెండో డోస్ తీసుకున్నారు. కాగా, జిల్లాకు సరిపడా వ్యాక్సిన్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.