కాంగ్రెస్ పార్టీకి టీక్యా సేవలు మరువలేనివి : కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-05-26T06:14:08+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి టీక్యానాయక్ చేసిన మరువలేనివని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కోక్యానాయక్తండాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీక్యానాయక్ విగ్రహాన్ని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నతో కలిసి
తిరుమలగిరి రూరల్, మే 25 : కాంగ్రెస్ పార్టీకి టీక్యానాయక్ చేసిన మరువలేనివని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కోక్యానాయక్తండాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీక్యానాయక్ విగ్రహాన్ని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి టీక్యా అనేక కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక పథకాలు అందించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేసి వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేష్, ప్రేమ్ప్రసాద్, ఎంపీటీసీ జుమిలాల్, రామోజీ పాల్గొన్నారు.