వాడపల్లి వేంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం రూ.50.51 లక్షలు

ABN , First Publish Date - 2022-06-30T06:47:17+05:30 IST

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను బుధవారం తెరిచారు. అయినవిల్లి దేవస్ధానం ఈవో పి.తారకేశ్వరరావు, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయ ఈవో కృష్ణచైతన్య, ఆలమూరు, గోపాలపురం గ్రూపు ఆలయాల ఈవో చింతలపూడి సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కించారు.

వాడపల్లి వేంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం రూ.50.51 లక్షలు

ఆత్రేయపురం, జూన్‌ 29: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీలను బుధవారం తెరిచారు. అయినవిల్లి దేవస్ధానం ఈవో పి.తారకేశ్వరరావు, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయ ఈవో కృష్ణచైతన్య, ఆలమూరు, గోపాలపురం గ్రూపు ఆలయాల ఈవో చింతలపూడి సత్యనారాయణ పర్యవేక్షణలో లెక్కించారు. 28 రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.44,33,453,  అన్నప్రసాద హుండీల ద్వారా రూ.6,18,468... మొత్తం రూ.50,51,921 ఆదాయం లభించింది. బంగారం 36 గ్రాములు, వెండి 427 గ్రాములు, వివిధ దేశాల కరెన్సీని భక్తులు సమర్పించారు. క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామి హుండీ ద్వారా రూ.99,066 ఆదాయం లభించినట్టు ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. లెక్కింపులో ధర్మకర్తలు, అర్చకులు, పోలీసులు, బ్యాంకు, దేవస్ధానం సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:47:17+05:30 IST