పాఠ్య పుస్తకాల విక్రయంపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-02T05:57:22+05:30 IST

పెద్దాపురం, మార్చి 1: మండల పరిధిలోని వడ్లమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (మెయిన్‌) హెచ్‌ఎం సత్యనారాయణ పాత పాఠ్య పుస్తకాలను అమ్మడంపై పాఠశాల చైర్మన్‌ అల్లు చంద్రరావు, వైసీపీ రాష్ట్ర నాయకుడు కంటే వీర్రాఘవరావు ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఎంఈవో జోసె్‌ఫలకు

పాఠ్య పుస్తకాల విక్రయంపై ఫిర్యాదు

పెద్దాపురం, మార్చి 1: మండల పరిధిలోని వడ్లమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (మెయిన్‌) హెచ్‌ఎం సత్యనారాయణ పాత పాఠ్య పుస్తకాలను అమ్మడంపై పాఠశాల చైర్మన్‌ అల్లు చంద్రరావు, వైసీపీ రాష్ట్ర నాయకుడు కంటే వీర్రాఘవరావు ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఎంఈవో జోసె్‌ఫలకు సోమవారం ఫిర్యాదు చేశారు. పాఠ్య పుస్తకాలను తమకు తెలియకుండా విక్రయాలు చేసేస్తున్నారని, ఆ సొమ్ములను ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని, హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎంఈవోను వివరణ కోరగా పాత పాఠ్యపుస్తకాలను, ఫైల్స్‌ తదితర వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ములు స్కూలు అకౌంట్‌కు జమచేయాల్సి ఉందని, విచారణ చేసి చర్యలు తీసుకంటామన్నారు.

Updated Date - 2021-03-02T05:57:22+05:30 IST