వాగు దాటుతూ మృత్యువాత
ABN , First Publish Date - 2020-11-30T04:37:17+05:30 IST
వాగు దాటుతూ పది రోజుల కిందట వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మద్దిరాల, నవంబరు 29: వాగు దాటుతూ పది రోజుల కిందట వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మామిండ్లమడవ ఆవాసప్రాంతమైన పీర్యనాయక్తండాకు చెందిన భూక్య మల్సూర్(60) 15 ఏళ్ల కిందట సూర్యాపేట మం డలం దాస్తండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. పది రోజుల కిందట పీర్యనాయక్తండాలోని బంధువుల వద్దకు బయలుదేరాడు. అప్పటినుంచి కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. అతడి కోసం వెతుకుతుండగా పాలేరు వాగులో శవమై ఆదివారం కనిపించాడు. వాగుదాటుతూ పడిపోయి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు.