నెలాఖరులోగా వైకుంఠధామాలు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-03-04T06:14:29+05:30 IST
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అన్ని వైకుంఠధామాలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని అద నపు కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు.
అదనపు జేసీ రాహుల్శర్మ
నల్లగొండటౌన్, మార్చి 3: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అన్ని వైకుంఠధామాలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని అద నపు కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో బుధవారం నిర్వహి ంచిన వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. వైకుంఠధామాలు, పల్లె ప్ర గతి పనులకు భూమి గుర్తింపు, భూ సమస్యలు పరిష్కరించి, సెగ్రిగే సన్ షెడ్లు, నర్సరీల నిర్వాహణ, పల్లె ప్రకృతివనాలపై మండలాల వారీగా సమీక్షించారు. పల్లె ప్రగతి పనులైన పల్లె పకృతి వనం, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లకు భూమి గుర్తించి, భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సెగ్రి గేషన్షెడ్ పూర్తయిన ప్రతి గ్రామపంచాయతీల్లో చెత్తను సెగ్రిగేట్ చేయాలని ఆదే శించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనికి గ్రామాల్లో ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతినెలా 3వ తేదీ లోపు సర్వైవల్ కాప్చర్ పూర్తిచేసి 15లోపు ట్యాంకర్లకు బిల్లులు చెల్లించాలన్నారు.