వజ్రోత్సవం సరే.. వికాసమేదీ?
ABN , First Publish Date - 2022-08-15T05:29:48+05:30 IST
ఇప్పటి వరకు ఆ గ్రామానికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదు. వజ్రోత్సవ భారతవనిలో సంక్షేమ ఫలాలు ఎరగని బడుగు జీవులు వాళ్లు.. అయినా గుండెనిండా దేశభక్తిని నింపుకొని జాతీయ పతాకాన్ని తమ పూరి గుడిసెల వద్ద ఎగురవేశారు.
75 ఏళ్ల భారత స్వాతంత్ర్యావనిలో ఆ పల్లె ప్రగతినెరగలేదు. కాలు చాపుకునేందుకు కూడా జాగలేని పూరిగుడిసెలు. గుండెల్లో బాధల గదులు తప్ప మేడలు లేవు. దుబ్బాక మండలం బొప్పాపూర్ దళితవాడ అభివృద్ధి లేక వెలివాడగానే మిగిలింది. రెండువందల పది కుటుంబాలున్న ఆ గ్రామంలో సుమారు 22 గుడిసెల వరకు ఉంటాయి. ఇప్పటి వరకు ఆ గ్రామానికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదు. వజ్రోత్సవ భారతవనిలో సంక్షేమ ఫలాలు ఎరగని బడుగు జీవులు వాళ్లు.. అయినా గుండెనిండా దేశభక్తిని నింపుకొని జాతీయ పతాకాన్ని తమ పూరి గుడిసెల వద్ద ఎగురవేశారు.
- దుబ్బాక