వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-08T06:39:02+05:30 IST
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ అ న్నారు.
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్
జగిత్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ అ న్నారు. హైదాబాద్లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు హాజరుకావడానికి వె ళ్తున్న జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల వాహనాన్ని ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈసంద ర్భంగా వసంత సురేశ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మే రకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించ డా నికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రజాప్రతినిధులను సమన్వయ పరుచుకుంటూ కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఇప్పటికే ఇం దుకు అవసరమైన షెడ్యూల్ ఖరారు చేసి అవసరమైన పనులు చేస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఇన్చార్జీ సీఈవో రామానుజచార్యులు, డీపీఓ నరేశ్ పాల్గొన్నారు.