ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2022-08-23T01:18:42+05:30 IST
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు
అమరావతి: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గనుల అక్రమ తవ్వకాల ఆరోపణల పిటిషన్ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు కోర్టు వాయిదా వేసింది.