వాల్మీకి కార్పొరేషన్ ద్వారా సహాయం
ABN , First Publish Date - 2020-11-27T05:47:28+05:30 IST
రాష్ట్రంలోని వాల్మీకి కార్పొరేషన్ ద్వారా వాల్మీకులకు సహాయ సహకారాలు అందిస్తామని ఆ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ అన్నారు.
మార్కాపురం(వన్టౌన్), నవంబరు 26 : రాష్ట్రంలోని వాల్మీకి కార్పొరేషన్ ద్వారా వాల్మీకులకు సహాయ సహకారాలు అందిస్తామని ఆ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం వాల్మీకి బోయల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ నిధులను జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందేవిధంగా చేస్తానని అన్నారు. తొ లుత ఆయన ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని కలిశారు. అనంతరం కార్పొరేషన్ చైర్మన్ను, డైరెక్టర్ నల్లబోతుల కొండయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, బీసీ సంఘం నాయకులు పి.ఎల్.ప్రసాద్, వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.