రూ. 6 లక్షల గుట్కాల స్వాధీనం

ABN , First Publish Date - 2021-01-22T05:12:52+05:30 IST

ఎస్‌ఈబీ సీఐ మహ్మద్‌ జలీల్‌ తన బృందంతో గురువారం రాత్రి దాడులు నిర్వహించి నాయుడుపేట ఆర్మూగంనగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 6 లక్షల విలువైన 11,046 గుట్కాల సాచెట్లను స్వాధీనం చేసుకున్నారు.

రూ. 6 లక్షల గుట్కాల స్వాధీనం
స్వాధీనం చేసుకున్న గుట్కాలపై మాట్లాడుతున్న ఎస్‌ఈబీ సీఐ జలీల్‌, పక్కన ఎస్‌ఐ శేషమ్మ

నాయుడుపేట, జనవరి 21 :  ఎస్‌ఈబీ సీఐ మహ్మద్‌ జలీల్‌ తన బృందంతో గురువారం రాత్రి దాడులు నిర్వహించి నాయుడుపేట ఆర్మూగంనగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 6 లక్షల విలువైన 11,046 గుట్కాల సాచెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈబీ సీఐ మహ్మద్‌ జలీల్‌ మాట్లాడుతూ  కె. రాజ్యలక్ష్మి అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు తమ నిఘాలో గుర్తించాచి దాడులు చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆమె నిల్వచేసిన గుట్కా సాచెట్ల ఎంఆర్‌పీల ధర దాదాపు రూ. 2 లక్షలైనా వాటి విక్రయాలు మాత్రం దాదాపు రూ. 6 లక్షలకు  ఉంటాయని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్‌ఈబీ ఎస్‌ఐ శేషమ్మ, సిబ్బంది బాబు సతీష్‌, ఎం. సురేష్‌, ఎం భాస్కర్‌, జీ రాజయ్య, రవిలు ఉన్నారు. 


Updated Date - 2021-01-22T05:12:52+05:30 IST