గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీనే..
ABN , First Publish Date - 2022-07-01T06:49:14+05:30 IST
2024లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంశీనేనని సీఎం తనతో చెప్పారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు
- ఎమ్మెల్యే కొడాలి నాని
గన్నవరం, జూన్ 30 : 2024లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంశీనేనని సీఎం తనతో చెప్పారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం దావాజీగూడెం ఎస్వీఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. టీడీపీ తరపున గన్నవరం, గుడివాడలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. పెనమలూరు సీటుకోసం వెళితే గుడివాడ, గన్నవరం వెళ్తారా అనాల్సిన దుస్థితి నెలకొందంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. నాని, వంశీని ఓడించలేరన్నారు.