వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2022-05-19T23:35:47+05:30 IST
ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో రోడ్లపై వంశీ పసుపు నీళ్లు చల్లించారని తెలిపారు.
విజయవాడ: ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో రోడ్లపై వంశీ పసుపు నీళ్లు చల్లించారని తెలిపారు. జగన్పై గౌరవం ఉంటే రాజీనామా చేసి రావాలని సవాల్ విసిరారు. ఏ ముఖం పెట్టుకుని వంశీ గడపగడపకు తిరుగుతున్నాడని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని తిట్టినందుకు తిరుగుతున్నాడా? అని ప్రశ్నించారు. వంశీని కార్యకర్తలు ఛీ కొడుతున్నారని తెలిపారు. వంశీ పక్కన ఉంటే తమను కూడా ఛీకొడతారని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలను సస్పెండ్ చేయడానికి వంశీ అనుచరులు ఎవరు?.... మీ అక్రమాలను నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఆదేశిస్తే గన్నవరం నుంచి పోటీ చేస్తానని శివభరత్ రెడ్డి ప్రకటించారు.