వందేభారత్ మిషన్ కొనసాగుతుంది: కేంద్రం

ABN , First Publish Date - 2020-08-08T20:51:02+05:30 IST

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరిలించేందుకు చేపట్టిన..

వందేభారత్ మిషన్ కొనసాగుతుంది: కేంద్రం

న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరిలించేందుకు చేపట్టిన 'వందే భారత్ మిషన్' కొనసాగుతుందని కేంద్ర పౌర విమానాయాన శాఖ ప్రకటించింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుపుతున్న ఎయిర్ ఇండియా ఐఎక్స్-334 విమానం కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో శుక్రవారం ప్రమాదానికి గురై 19 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో పౌర విమానాయాన శాఖ తాజా ప్రకటన చేసింది.


మే 7వ తేదీన 'వందే భారత్ మిషన్'ను ఇండియా చేపట్టింది. విదేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 9.5 లక్షల మంది భారతీయులను ఇంతవరకు స్వదేశానికి తీసుకు వచ్చింది. ప్రస్తుతం వందేభారత్ మిషన్ 5వ ఫేజ్ నడుస్తోంది.

Updated Date - 2020-08-08T20:51:02+05:30 IST