ఆ పుస్తకంలో ఒక్క అబద్దం ఉన్నట్లు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధం: వంగలపూడి అనిత
ABN , First Publish Date - 2022-04-26T23:54:42+05:30 IST
ఆ పుస్తకంలో ఒక్క అబద్దం ఉన్నట్లు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధం: వంగలపూడి అనిత
అమరావతి: జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పుస్తకంను టీడీపీ విడుదల చేసింది. మూడేళ్లలో 800 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పుస్తకంలో వెల్లడిపరిచింది. నిందితుల్లో ఎక్కువ మంది వైసీపీ నేతలేనని పుస్తకంలో ప్రస్తావించారు. లైంగిక వేధింపుల్లో మంత్రి అంబటి, మాజీమంత్రి అవంతి కూడా ఉన్నారని టీడీపీ పేర్కొంది. పుస్తకంలో ఒక్క అబద్దం ఉన్నట్లు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని టీడీపీ నేత వంగలపూడి అనిత సవాల్ విసిరారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని జగన్రెడ్డి దిగిపోవాలని డిమాండ్ చేశారు. యధా లీడర్.. తథా కేడర్..ఇదీ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అని వంగలపూడి అనిత విమర్శించారు.