మా తమ్ముడికి ఏమైనా జరిగితే.. వాళ్ల సంగతి తేలుస్తా: వంగవీటి రాధా సోదరుడు

ABN , First Publish Date - 2021-12-27T19:27:33+05:30 IST

తనను చంపేందుకు రెక్కీ చేశారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.

మా తమ్ముడికి ఏమైనా జరిగితే.. వాళ్ల సంగతి తేలుస్తా: వంగవీటి రాధా సోదరుడు

విజయవాడ : తనను చంపేందుకు రెక్కీ చేశారంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ మారతారనే ఊహాగానాలపై టీడీపీ, వైసీపీ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. రాధా వ్యాఖ్యలపై ఆయన సోదరుడు(పెదనాన్న కుమారుడు), బీజేపీ నేత వంగవీటి నరేంద్ర స్పందించారు. తన తమ్ముడుతో రాజకీయంగా విభేదించానన్నారు. టీడీపీలోకి వెళ్లడాన్ని తప్పు పట్టానన్నారు. ఇంకా నరేంద్ర మాట్లాడుతూ.. ‘మాకు మాకు వంద ఉండొచ్చు... బయటి వాళ్లు మా జోలికి వస్తే ఊరుకోం. మా తమ్ముడికి ఏమైనా జరిగితే... వాళ్ల సంగతి తేలుస్తా. నా తమ్ముడికి నేను అండగా‌ ఉంటా’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2021-12-27T19:27:33+05:30 IST