వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం : తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-11-30T04:47:10+05:30 IST
వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు పూర్తి వైఫల్యం చెందారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు డా.ఎన్.తులసిరెడ్డి విమర్శించారు.
కడప(కలెక్టరేట్), నవంబరు 29: వరద బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు పూర్తి వైఫల్యం చెందారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు డా.ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. ఆదివారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధ్యక్షుడు నీలిశ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డిలతో కలసి బాధితులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కడప పార్లమెంట్ ఇన్చార్జ్ గుండ్లకుంట శ్రీరాములు, కమలాపురం ఇన్చార్జ్ పొట్టిపాటి చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యధర్శి తిరుమలేశు, సాధిక్ అలీ, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.