అప్పన్నకు తుదివిడత చందన సమర్పణ

ABN , First Publish Date - 2020-07-06T10:03:20+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం తుదివిడత చందనాన్ని సమర్పించారు. ఆషాఢ పూర్ణిమ ..

అప్పన్నకు తుదివిడత చందన సమర్పణ

సింహాచలం, జూలై 5: వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం తుదివిడత చందనాన్ని సమర్పించారు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలను మిళితం చేసిన మూడు మణుగుల చందనాన్ని స్వామివారికి అర్చకులు సమర్పించారు. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి విశేష అభిషేకాలు జరిపి చందనాన్ని కిరీటంగా అలంకరించారు. కరోనా నేపథ్యంలో అప్పన్న ఆలయ ప్రదక్షిణలను రద్దు చేయడంతో పలువురు భక్తులు కొండదిగువ తొలిపావంచా వద్ద స్వామిని దర్శించుకున్నారు. 

Updated Date - 2020-07-06T10:03:20+05:30 IST