Bhadradri: భద్రాద్రి రామాలయంలో సహస్రనామ కుంకుమార్చన పూజలు
ABN , First Publish Date - 2022-08-05T13:20:32+05:30 IST
శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ...
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా: శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratam) సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమం జరగనుంది. శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రతం కనులపండువగా జరుగుతోంది. రామాలయంలో స్వర్ణాలంకృతులైన మూలమూర్తులకు అర్చకులు సుప్రభాతం నిర్వహించి నామార్చనలు చేసి ఆరాధించారు. భక్తులు అమ్మవారికి వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.