9న చిలకలూరిపేటలో వరసిద్ధుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-09-27T05:37:30+05:30 IST

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అక్టోబరు 9న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు సోమవారం తెలిపారు.

9న చిలకలూరిపేటలో వరసిద్ధుడి కల్యాణం
ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న చైర్మన్‌, ఈవో

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 26: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అక్టోబరు 9న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు సోమవారం తెలిపారు. చిలకలూరిపేటలోని శ్రీవినాయక ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాణిపాకం నుంచి ఆలయ ప్రచార రథం చిలకలూరిపేటకు వెళ్లనుందన్నారు. ఈ కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికలను వారు ఆవిష్కరించారు.


Updated Date - 2022-09-27T05:37:30+05:30 IST