సీఎం జగన్కు వర్ల రామయ్య లేఖ
ABN , First Publish Date - 2021-11-08T23:54:18+05:30 IST
సీఎం జగన్కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనపై లేఖ రాశారు. విద్యార్థులపై జగన్రెడ్డి పోలీసులతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు.
అమరావతి: సీఎం జగన్కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనపై లేఖ రాశారు. విద్యార్థులపై జగన్రెడ్డి పోలీసులతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఎయిడెడ్పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను దోచుకునేందుకు పేద విద్యార్థుల భవిష్యత్ను తాకట్టు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు, దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు విద్యార్థులపై సైతం దాడులు చేయడం హేయమన్నారు.