రఘురామపై కక్షకు ముఖ్య కారణం ఇదే: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2021-05-15T18:12:47+05:30 IST
అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై ముఖ్యమంత్రి కక్షకు ముఖ్య కారణం, జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో
అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై ముఖ్యమంత్రి కక్షకు ముఖ్య కారణం, జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఆయన ఫిర్యాదు చేయడమేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. నేడు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఎంపీ రఘురామరాజుపై ముఖ్యమంత్రి కక్ష్యకు ముఖ్య కారణం, ఆయన బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేయడం, సీబీఐ కోర్టు దానిని విచారణకు అంగీకరించడం, ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా అభాసుపాలు కావడంమే అసలుకారణం. న్యాయ వ్యవస్థ కూడా విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల పట్ల వ్యత్యాసం చూపకూడదు’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.