వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ మౌనం వీడాలి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-03-01T21:32:37+05:30 IST

వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ మౌనం వీడాలి: వర్ల రామయ్య

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని వాంగ్మూలాలు జగన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని.. వేలెత్తి చూపిస్తున్నా.. సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు.. ఉన్నట్లు, రాజశేఖర్ రెడ్డి, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదన్నారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్‌రెడ్డి తన విలేకరుల సమావేశంలో.. ఆ లేఖ గురించి ఎలా ప్రస్తావించారని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Updated Date - 2022-03-01T21:32:37+05:30 IST