ఏపీ జైళ్లశాఖ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
ABN , First Publish Date - 2022-02-16T23:28:52+05:30 IST
ఏపీ జైళ్లశాఖ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
అమరావతి: ఏపీ జైళ్లశాఖ డీజీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. కడప జైల్లో ఉన్న వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని లేఖలో పేర్కొన్నారు. జైల్లో ఉన్న వివేకా హత్యకేసు నిందితులకు రక్షణ కల్పించాలన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలన్నారు. జైల్లో ఉన్నవారి ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉందని భావించాల్సి ఉంటుందన్నారు.