వివేకాను చంపిందెవరో జగన్‌కు తెలుసు: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-04-12T23:18:27+05:30 IST

వైఎస్ వివేకానందారెడ్డిని చంపిందెవరో సీఎం జగన్‌కు తెలుసునని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.

వివేకాను చంపిందెవరో జగన్‌కు తెలుసు: వర్ల రామయ్య

అమరావతి: వైఎస్ వివేకానందారెడ్డిని చంపిందెవరో సీఎం జగన్‌కు తెలుసునని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తిరుపతి ఎన్నికల సభకు జగన్ ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ తిరుపతి సభకు వెళ్తే కరోనా వ్యాప్తి చెందుతుందనడం సరైన కారణం కాదన్నారు. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 14న సీబీఐ జగన్‌ను విచారిస్తుందని సమాచారం ఉందన్నారు. బాబాయిని చంపిందెవరో జగన్‌కు తెలుసని పులివెందులంతా కోడై కూస్తోందని వర్ల రామయ్య తెలిపారు.

Updated Date - 2021-04-12T23:18:27+05:30 IST