తెగేవరకు లాగకండి.. గతంలో పాక్లోనూ ఇంతే: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2020-10-26T20:54:58+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తీరు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన..
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీరు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్రంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు మధ్య అగాధం నానాటికీ పెరుగుతోందని అన్నారు. ఈ వ్యవస్థల తీరు, గతంలో పాకిస్తాన్ ప్రధానిగా ముషారఫ్ ఉన్న సమయంలో రెండు వ్యవస్థల మధ్య వైరం పెరిగి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను తలపిస్తోందన్నారు. తెగేంత వరకు లాగకండని హెచ్చరించారు.