బీసీ కమిషన్‎కు వర్ల రామయ్య లేఖ

ABN , First Publish Date - 2022-08-28T17:05:37+05:30 IST

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ బీసీ కమిషన్‌కు లేఖ రాశారు. ఏపీలో కొందరు పోలీసులు

బీసీ కమిషన్‎కు వర్ల రామయ్య లేఖ

అమరావతి: టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(TDP Polit Bureau Member Varla Ramaiah) జాతీయ బీసీ కమిషన్‌కు(National BC Commission) లేఖ రాశారు. ఏపీలో కొందరు పోలీసులు వైసీపీ (Ysrcp) కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అర్ధరాత్రి అరెస్ట్‌లు, చిత్రహింసలకు గురిచేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. అనంతపురం జిల్లా యాడికి చెందిన ఆరుగురు బీసీ యువకులపై.. తాడిపత్రి పోలీసులు కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో తెలిపారు.

Updated Date - 2022-08-28T17:05:37+05:30 IST