భారీ వర్షాల హెచ్చరిక
ABN , First Publish Date - 2021-11-29T05:22:54+05:30 IST
రాబోయే నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురస్తాయని భారత వాతావరణ శాఖ విశాఖపట్టణం కేంద్రం తుపాను హెచ్చరికలు జారీచేసినట్లు కలెక్టర్ వివేక్యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాబోయే నాలుగు రోజుల పాటు
జాగ్రత్తగా ఉండాలన్న కలెక్టర్ వివేక్యాదవ్
గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాబోయే నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురస్తాయని భారత వాతావరణ శాఖ విశాఖపట్టణం కేంద్రం తుపాను హెచ్చరికలు జారీచేసినట్లు కలెక్టర్ వివేక్యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి డిసెంబరు 1 వరకు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా భారీ వర్షంలో ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.