Owaisi కి BJP ఎంపీ Varun Gandhi కృతజ్ఞతలు
ABN , First Publish Date - 2022-06-13T22:47:08+05:30 IST
నిరుద్యోగంపై తాను అందించిన డేటా ఆధారంగా పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తినందుకు ఏఐఎంఐఎం(AIMIM) అధినేత ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)కి భారతీయ జనతా పార్టీ(BJP) నేత, పిలిబిట్ ఎంపీ(Pilibhit MP) వరుణ్ గాంధీ(Varun Gandhi) కృతజ్ఞతలు తెలిపారు..
న్యూఢిల్లీ: నిరుద్యోగంపై తాను అందించిన డేటా ఆధారంగా పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తినందుకు ఏఐఎంఐఎం(AIMIM) అధినేత ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)కి భారతీయ జనతా పార్టీ(BJP) నేత, పిలిబిట్ ఎంపీ(Pilibhit MP) వరుణ్ గాంధీ(Varun Gandhi) కృతజ్ఞతలు తెలిపారు. ఒకానొక సందర్భంలో వరుణ్ గాంధీ చెప్పిన ఈ లెక్కల్ని ఓవైసీ ఒక్కొక్కటిగా పార్లమెంట్లో ప్రస్తావించారు. అంతే కాకుండా ఈ డేటాను బీజేపీ నేత వరుణ్ గాంధీయే షేర్ చేశారంటూ పలుమార్లు పేర్కొన్నారు. కాగా, ఓవైసీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను వరుణ్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘నిరుద్యోగం నేడు దేశంలో అతిపెద్ద సమస్య. ఈ సమస్యపై ప్రభుత్వంపై దృష్టిసారించేలా యావత్ దేశ నాయకులు సహకరించాలి. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగినప్పుడే ఈ దేశం శక్తివంతం అవుతుంది’’ అని ట్వీట్ చేశారు. ఇంకా ఈ ట్వీట్ను కొనసాగిస్తూ ‘‘ఓవైసీ పార్లమెంట్లో ప్రసంగిస్తున్నప్పుడు నా ప్రశ్నల్ని లేవకనెత్తినందుకు కృతజ్ఞతలు’’ అని చివరగా రాసుకొచ్చారు.