ఎన్నికల పరిశీలకుడిగా వాసం వెంకటేశ్వర్లు
ABN , First Publish Date - 2021-04-24T05:14:40+05:30 IST
సిద్దిపేట మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ వాసం వెంకటేశ్వర్లును ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమిస్తున్నట్లు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
సిద్దిపేట సిటీ, ఏప్రిల్ 23: సిద్దిపేట మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ వాసం వెంకటేశ్వర్లును ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమిస్తున్నట్లు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆయన సిద్దిపేట మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. మొదట కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ఖాన్, సుడా వైస్ చైర్మన్ డా.కెవి.రమణాచారితో ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించారు. అనంతరం ఇందూర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్లను, విపంచి కళానిలయంలోని ఎలక్షన్ మెటీరియల్ను తనిఖీ చేశారు. తదనంతరం మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. పోల్ చిట్టీల పంపిణీపై ఆరా తీసి, ఆరు పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయనవెంట డీఈ విబిన్కుమార్, ఏఈలు మహేష్, అన్వేష్, యాదగిరి, రెవెన్యూ ఆఫీసర్ శ్రీకాంత్, మునిసిపల్ ఎన్నికల సిబ్బంది ఉన్నారు.