Coimbatore MLA: బీజేపీ ఉన్నత కార్యాచరణ మండలిలో వానతి శ్రీనివాసన్కు సభ్యత్వం
ABN , First Publish Date - 2022-08-19T16:02:36+05:30 IST
శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే బీజేపీ ఉన్నత కార్యాచరణ మండలిలో రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా
చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే బీజేపీ ఉన్నత కార్యాచరణ మండలిలో రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా విభాగా నాయకురాలు, కోయంబత్తూరు శాసనసభ్యులు(Coimbatore MLA) వానతిశ్రీనివాసన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP National President JP Nadda) సభ్యులుగా ఉంటున్నారు. ఈ కమిటీలో బుధవారం బీజేపీ అధిష్టానవర్గం మార్పులు కొత్తవారిని సభ్యులుగా నియమించింది. అలా నియమించినవారిలో వానతి శ్రీనివాసన్కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానవర్గం తనపై నమ్మకముంచి ఉన్నత కార్యాచరణ మండలి సభ్యురాలిగా నియమించడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ పదవి వల్ల తనకు బాధ్యతలు పెరిగాయని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పదవిలో నియమితులైన తొలి తమిళ మహిళ తానేనని ఆమె తెలిపారు.