Veeam: హైదరాబాద్‌కు చేరుకున్న ‘హోప్ ఆన్ వీయం రోడ్ షో’

ABN , First Publish Date - 2022-10-04T02:08:20+05:30 IST

బ్యాకప్, రికవరీ డేటా మేనేజ్‌మెంట్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ వీయం సాఫ్ట్‌వేర్ (Veeam software) ఇప్పుడు హైదరాబాద్

Veeam: హైదరాబాద్‌కు చేరుకున్న ‘హోప్ ఆన్ వీయం రోడ్ షో’

హైదరాబాద్: బ్యాకప్, రికవరీ డేటా మేనేజ్‌మెంట్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ వీయం సాఫ్ట్‌వేర్ (Veeam software) ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశించింది. తమ అత్యాధునిక డేటా ప్రొటెక్షన్‌ పరిష్కారాలను అన్ని వాతావరణాలు.. క్లౌడ్‌, వర్చువల్, సాస్‌, కుబెర్‌నెట్స్‌, ఫిజికల్‌‌లో అత్యంత అధునాతన డేటా పరిరక్షణ పరిష్కారాలను హైదరాబాద్‌ మార్కెట్‌లో పరిచయం చేసింది. ఈ సంస్థ ఇటీవల ‘హోప్ ఆన్ వీయం: యువర్ జర్నీ టు మోడ్రన్ డేటా ప్రొటెక్షన్’ను ప్రారంభించింది. ఇండియాలో ఈ సంస్థకు ఇది మొట్టమొదటి మల్టీ సిటీ రోడ్ షో. ఈ షో ద్వారా వీయం భాగస్వాములు,  వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుత డాటా ప్రొటెక్షన్‌కు సంబంధించి  విషయ పరిజ్ఞానంతో కూడిన చర్చలను చేయడం వీలవుతుంది. ‘హోప్‌ ఆన్‌ వీయం’ బస్‌లో గతంలో ఎన్నడూ చూడని రీతిలో ల్యాబ్‌ ఉంటుంది. ఇంజినీర్లు ఏడబ్ల్యూఎస్‌, అజూర్‌, గుగూల్‌ క్లౌడ్‌ కోసం క్లౌడ్‌ నేటివ్‌ పరిష్కారాలపై లైవ్‌ డెమోలు, మైక్రోసాఫ్ట్‌ 365 కోసం సాస్‌ ఆఫరింగ్స్‌,  కంటిన్యూస్‌ డేటా ప్రొటెక్షన్‌ సొల్యూషన్స్‌ (CDP), వీయం డిజాస్టర్‌ రికవరీ ఆర్కెస్ట్రార్‌ (VDRO) వీయం క్లౌడ్‌ కనెక్ట్‌ , ఎన్‌ఏఎస్‌ బ్యాకప్‌ , వీయం బ్యాకప్‌, రెప్లికేషన్‌వీ11, వీఎంవేర్‌ వీస్ఫియర్‌ కోసం ఇన్‌స్టెంట్‌ రికవరీ వంటివి ప్రదర్శిస్తారు.


వ్యాపార సంస్ధలు డేటాతోపాటు తాము సృష్టించిన డేటాపై ఆధారపడటం గణనీయంగా పెరిగింది. దీనివల్ల ఈ  సంస్ధలు మరింతగా సైబర్‌దాడుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.  వీయం డేటా ప్రొటెక్షన్‌ ట్రెండ్స్‌ నివేదికలు 2022 ప్రకారం.. గత 12 నెలల కాలంలో 84 శాతం భారతీయ సంస్థలు రాన్సమ్‌వేర్‌ బారిన పడ్డాయి. వరుసగా రెండో సంవత్సరం ఈ సంస్ధలు ఎక్కువ సమయం ఉత్పత్తి లేకుండా ఉండటానికి సైబర్‌దాడులు ఓ కారణంగా  నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వ్యాపార సంస్థలకు డేటా బ్యాకప్స్‌‌పై అవగాహన కల్పించడం, వ్యాపార కొనసాగింపునకు తగిన భరోసా అందిస్తూ డేటా పరిరక్షణ పరిష్కారాలను అందుబాటులో ఉంచడంపై అవగాహన కల్పించే అవకాశాన్ని వీయం అందిస్తోంది.


ఈ సందర్భంగా వీయం ఇండియా-సార్క్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ బాంబురీ మాట్లాడుతూ.. రాన్సమ్‌వేర్‌ లాంటి సైబర్‌దాడులు తరచుగా జరుగుతున్నాయని అన్నారు. ఫలితంగా వ్యాపారకార్యకలాపాలలో తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని అన్నారు. వీయం డాటా ప్రొటెక్షన్‌, రికవరీ పరిష్కారాల కారణంగా వ్యాపార సంస్ధలు తమ డాటాను సొంతం చేసుకోవడం, నియంత్రించుకోవడం, రక్షించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అది వారి ప్రాంగణంలో ఉన్నా, క్లౌడ్‌పై ఉన్నా లేదంటే  కంటెయినర్స్‌తో నిర్మితమైన ఆధునిక అప్లికేషన్‌లో భాగమై, క్యుబ్‌మీట్స్‌ నిర్వహిస్తున్నా సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్‌లో ఫార్మాస్యూటికల్స్‌, తయారీ రంగాలలో తమ మార్కెట్‌ విస్తరణకు గణనీయమైన అవకాశాలున్నాయని తెలిపారు.  


వచ్చే నాలుగు వారాల్లో ‘హోప్‌ ఆన్‌ వీయం’ బస్సు తొమ్మిది నగరాలు సందర్శించడంతో పాటుగా డేటా భద్రత పరిష్కారాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తుంది. ఈ బస్సు తన ప్రయాణాన్ని సెప్టెంబర్‌ 16న గురుగ్రామ్‌లో ప్రారంభించింది. జైపూర్‌, అహ్మదాబాద్‌, ముంబై, పూణెలలో ఆగింది. అక్టోబర్‌ 3న హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ నెల 7న చెన్నై, 10న కోచి, 12న బెంగళూరుకు చేరుకుంటుంది.

Updated Date - 2022-10-04T02:08:20+05:30 IST