వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది: వీరాంజనేయులు

ABN , First Publish Date - 2021-07-28T21:16:27+05:30 IST

వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మండిపడ్డారు.

వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది: వీరాంజనేయులు

ఏలూరు: వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మండిపడ్డారు. టీడీపీ నేతలపై ఎన్ని దాడులు చేసి అరెస్టులు చేసినా రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడిలపై పోరాటం ఆగదని హెచ్చరించారు. బీమడోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మాజీమంత్రి దేవినేని ఉమపై జరిగిన దాడిని ఆటవిక చర్యగా అభివర్ణించారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం పారెస్ట్‌లో దేవినేని కారుపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని తప్పుబట్టారు. ఆయనపై దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి దేవినేనితో పాటు దాడిలో గాయపడిన మరో 18 మందిపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఉమాపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు ఏ విధంగా పెడతారని వీరాంజనేయులు నిలదీశారు. 




Updated Date - 2021-07-28T21:16:27+05:30 IST